Saturday, April 20, 2024

తమిళనాడు ఎన్నికల నిర్వహణ కోసం తంటా

తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు గుర్రాలు, గాడిదల వేటలో పడ్డారు. ఎందుకంటే తేని జిల్లాలో పశ్చిమ కనుమలకు చేరువగా 30కి పైగా చిన్న గిరిజన గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లోకి వాహనాలు వెళ్లేందుకు అనువైన రోడ్డు సౌకర్యం లేకపోవడం అధికారుల పీకలమీదకు వచ్చింది. దాదాపు 10 గ్రామాల్లో అసలు రోడ్డే లేదు. ఈ మేరకు అక్కడికి పోలింగ్ సామాగ్రిని తరలించడం అధికారులకు పెద్ద కష్టంగా మారింది.

దీంతో గాడిదలు, గుర్రాల ద్వారా పని పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వారు గుర్రాలు, గాడిదలను వెతుకుతున్నారు. అధికారులకు అవసరమైన ఫర్నిచర్, ఈవీఎంలు, నీళ్ల సీసాలు, అట్టపెట్టెలు తదితర వాటిని తరలించేందుకు గాడిదలు, గుర్రాలను అద్దెకు తీసుకోమంటూ సిబ్బందిని అధికారులు ఆదేశించారు. దీంతో తేని జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించనున్న సిబ్బంది వాటి కోసం వెతుకులాట మొదలుపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement