Thursday, April 18, 2024

Breaking: ఒమిక్రాన్‌పై భ‌యం వ‌ద్దు.. ప్ర‌గ‌తి భ‌వ‌న్ స‌మీక్ష‌లో సీఎం కేసీఆర్‌..

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఈరోజు మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో పలు కీలక విషయాలపై మంత్రులతో సీఎం కేసీఆర్‌ చర్చిస్తున్నట్లు సమాచారం. వ‌డ్ల‌ సేకరణ విషయంలో కేంద్ర‌ ప్రభుత్వ వైఖరిపై ఫోక‌స్ చేస్తున్న‌ట్టు తెలుస్తున్నది. కేంద్రం ధాన్యాన్ని సేకరించేలా ఒత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులకు సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేస్తున్న‌ట్టు స‌మాచారం.

యాసంగిలో వ‌డ్లు తీసుకోబోమని కేంద్రం తెగేసి చెప్పిన నేపథ్యంలో ఇతర పంటల సాగుపై రైతులకు సూచనలు చేసే విషయంపై కూడా కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. అలాగే ప్రపంచాన్ని కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాందోళనలకు గురి చేస్తున్నది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఆ మ‌హ‌మ్మారి ప్రవేశించకుండా అడ్డుకునే చర్యలపై, దాన్ని ఎదుర్కొనేందుకు సంబంధిత శాఖలన్నింటినీ సిద్ధంచేసే ప్రణాళికపై సీఎం కేసీఆర్‌ సూచనలు చేస్తున్నారు. వీటితోపాటు పోడు భూములు, దళితబంధు తదితర అంశాలపైనా చ‌ర్చించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

మొదటగా.. రాష్ట్ర ప్రజారోగ్యం, వైద్యసేవలకు సంబంధించి హెల్త్ డిపార్ట్ మెంట్ సన్నద్దత, అనుసరిస్తున్న కార్యాచరణ, రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ టీకాల పురోగతి, మందుల లభ్యత, ఆక్సిజన్ బెడ్స్ సామర్థ్యం, తదితర అంశాలపై కేబినెట్ సమీక్షించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణపై వైద్యశాఖ అధికారులు నివేదిక అందించారు. కరోనా పరీక్షలు మరిన్ని ఎక్కువగా చేయడానికి అవసరమైన ఏర్పాట్లు సన్నద్దతపై కేబినెట్ చర్చించింది. అదే సందర్భంలో కరోనా నుంచి ’’ఒమిక్రాన్’’ పేరుతో కొత్త వేరియంట్ వస్తున్నదనే వార్తల నేపథ్యంలో ఈ కొత్త కరోనా వేరియంట్ గురించి వైద్య అధికారులు కేబినెట్ కు వివరించారు. వివిధ దేశాల్లో ఒమిక్రాన్ పరిస్థితి ని తెలిపారు. నివేదిక సమర్పించారు.

రెండు సంవత్సరాలుగా కరోనా కట్టడికోసం జరిగిన పురోగతి మీద కేబినెట్ చర్చించింది. వైద్యశాఖ పూర్తి సన్నద్ధతతో ఉన్నదని, అన్ని రకాల మందులు, పరికరాలు, మానవ వనరులు, పూర్తిగా అందుబాటులో ఉన్నాయని.. అన్ని రకాలుగా తాము సంసిద్దంగా ఉన్నామని వైద్యాధికారులు కేబినెట్ కు వివరించారు. రాష్ట్రంలోని అన్ని దవాఖానాలల్లోని పరిస్థితులను సమీక్షించాలని, అన్ని రకాల మందులు, టీకాలతో సహా ఇతరత్రా అవసరమైన మౌలిక వసతులను సమకూర్చుకోవాలని, ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి రాష్ట్ర వైద్యశాఖ సిద్దంగా వుండాలని కేబినెట్ ఆదేశించింది.

- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని, అందుకు మంత్రులందరూ వారి వారి జిల్లాల్లో సమీక్షించాలని, అవసరమైన వారందరికీ సత్వరమే టీకా ఇప్పించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. జిల్లాల వారిగా టీకా ప్రక్రియ ను సమీక్షించి., అదిలాబాద్, కుమురంభీం నిర్మల్, మహబూబ్ నగర్, నారాయణ పేట, గద్వాల్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆరోగ్యశాఖ కార్యదర్శిని కేబినెట్ ఆదేశించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement