Saturday, April 20, 2024

ఏడేళ్లలో 32బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు

తెలంగాణ పాలసీలు పెట్టుబడులకు అనుకూలం: మంత్రి కేటీఆర్‌
24 శాతం కంటే ఎక్కువ పెట్టుబడులు ప్రస్తుత పెట్టుబడిదారులవే
హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గత ఏడేళ్లల్లో 32 బిలియన్‌ డాలర్ల విలువైన పెట్టుబడులను రాష్ట్రం లోకి ఆకర్షించామని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. 24 శాతం కంటే ఎక్కువ పెట్టు బడులు ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారుల నుంచి వచ్చాయని ఆయన చెప్పారు. హదరాబాద్‌లో శుక్రవారం పబ్లిక్‌ అఫైర్స్‌ ఫోరమ్‌ ఆఫ్‌ ఇండియా (పీఏఎఫ్‌ఐ) 8వ జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రానికి పెట్టుబడులను స్వాగతిస్తూ, అదే స్థాయిలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సచహస్తున్నామని తెలిపారు. పెట్టుబడిదారులను జాగ్రత్తగా చూసుకున్న ప్పుడు… అతిపెద్ద బ్రాండ్‌ అంబాసిడర్లు అవుతారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో పెట్టు బడులకు అనువైన వాతావరణం కల్పించడంలో విజయం సాధించామన్నారు. తెలంగాణ సర్కార్‌ పారిశ్రామిక రంగంలో యువతకు ప్రోత్సాచహం అందిస్తున్నదని తెలిపారు. పెట్టుబడు లను సులభతరం చేయడానికి ప్రభుత్వం అనేక మెరుగైన, అత్యంత సులువైన విధానాలు, మౌలి క సదుపాయాలు కల్పిస్తున్నదని, పారదర్శక పాలసీలతో పెట్టుబడులను సాధిండంలో సఫల మవుతున్నామన్నారు. పెట్టుబడిదారులకు చాలా ప్రొఫెషనల్‌ పద్ధతిలో మార్గనిర్దేశం చేసే యువ నిపుణులనుప్రభుత్వం నియమించిందని వెల్లడించారు. ఃరాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉంది. పారిశ్రామికవేత్తలను ప్రోత్సచహస్తున్నాం. ఏడేళ్లలో 32 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు తీసుకువచ్చాం. ఔత్సాచహకులకు ప్రోత్సాచహకాలిస్తున్నాం. ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నాంః అని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. యువ నిపుణులు ఏడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఇన్వెస్ట్‌ తెలంగాణ అనే బ్యానర్‌ కింద పనిచేస్తున్నారని. ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, లైఫ్‌ సైన్స్‌, ఫార్మాసూటికల్స్‌, బయోటెక్‌, మెడికల్‌ ఉపకరాలు, ఏరోస్పేస్‌, ఆహార శుద్ధి పరిశ్రమలు, టైక్స్‌టైల్స్‌, ఆటోమోటివ్‌ ఎలక్ట్రానిక్‌ వాచహనాల, జెమ్స్‌, జ్యూయలరీ, లాజిస్టిక్స్‌ వంటి రంగా లకు ప్రాధాన్యత ఇస్తున్నాయని మంత్రి కేటీఆర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement