Saturday, April 20, 2024

Breaking: ఆన్‌లైన్‌ బెట్టింగ్ బుకీల అరెస్టు.. రూ.2 కోట్లకు పైగా నగదు స్వాధీనం..

వరంగల్ క్రైమ్ (ప్రభ న్యూస్): వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముంబయి కేంద్రంగా ఆన్లైన్ ద్వారా క్రికెట్, మూడు ముక్కుల పేకాట బెట్టింగ్కు పాల్చడుతున్న ఇద్దరు బుకీలను సోమవారం కేయూసీ పోలీసులు అరెస్టు చేసారు. వారి నుండి సుమారు 2కోట్ల 5లక్షల 14వేల రూపాయల నగదు, 7 సెల్ ఫోన్లు, వివిధ బ్యాంకులకు సంబంధించి. 43 పాసు బుక్ లు, ఏటియం కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హ‌న్మ‌కొండ జిల్లాకు చెందిన‌ మాడిశెట్టి ప్రసాద్ (40), మ‌హారాష్ట్ర‌కు చెందిన అభయ్ విలాస్ రావు ల‌ను అరెస్టు చేశారు.

ఈ ఆన్లైన్ బెట్టింగ్ బుకీల అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా సీపీ మాట్లాడుతూ.. మాడిశెట్టి ప్రసాద్ కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ హఫీజ్ పేటలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని రెడీమెడ్ బట్టల వ్యాపారం చేస్తున్నాడు. ఈ బట్టల వ్యాపారం ద్వారా తన కుటుంబ పోషణ కష్టం కావడంతో సులభంగా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశాడు. ఇందుకోసం హఫీజ్ పేటలో మరికొంత‌ మంది స్నేహితులతో కలిసి 2016 నుండి క్రికెట్ బెట్టింగ్ ప్రారంభించాడు.

ఈ బెట్టింగ్ ద్వారా పెద్ద మొత్తం డబ్బు సంపాదించడంతో పాటు 2018లో తన స్నేహితుల ద్వారా స్మార్ట్ ఫోన్‌లో అన్లైన్ ద్వారా క్రికెట్, మూడు ముక్కల పేకాట బెట్టింగ్ నిర్వహించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ప్రసాద్ ముంబ‌యి కేంద్రంలో ఆన్లైన్ ద్వారా క్రికెట్, మూడు ముక్కలపేకాట బెట్టింగ్ నిర్వహకుడు మరోనిందితుడు అభయ్ తో పరిచయం అయింది. ఈ పరిచయం ద్వారా ప్రసాద్ కి ఆన్లైన్ బెట్టింగ్ పై పూర్తిస్థాయిలో అవగాహన కలగడంతో పాటు, అభయ్ నిర్వహించే ఆన్లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్‌ ద్వారా ప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించే బుకీగా నియమించబడ్డాడు.

దీనితో ఆన్లైన్ లో బెట్టింగ్ పాల్గోనేవారు ముందుగా అన్లైన్ ద్వారాగాని వ్యక్తిగతంగా డబ్బు చెల్లించిన వ్యక్తులకు అభయ్ నుండి వచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డలను వాట్సప్ ద్వారా బెట్టింగ్లో పాల్గొనే వ్యక్తులకు అందజేసేవాడు. వీటి ద్వారా ఖాతాదారులు ఆన్లైన్ ద్వారా క్రికెట్, మూడు ముక్కలపేకాట బెట్టింగ్ పాల్గొనేవారు. ఈ బెట్టింగ్లో గెలుపొందిన వ్యక్తులకు పందెం కాసిన డబ్బు రెట్టింపు అందజేసేవారు. ప్రసాద్ అందజేసే డబ్బులో కమిషనర్ మినహాయించి మిగితా డబ్బును అభయ్ అందజేసేవాడు. ఈ విధంగా రోజు వారీ లావాదేవీల అనంతరం వచ్చిన లాభంలో ప్రసాద్ వాటాలను అనసరించి బెట్టింగ్ వెబ్సైట్ నిర్వహకుడు అభయ్‌కు అందజేసేవాడు. ప్రసాద్ ఈ డబ్బు లావాదేవీల కోసం బీనామీ పేర్లపై బ్యాంక్ ఖాతాలను నిర్వహించేవాడు.

ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్, వెబ్ సైట్ నిర్వహణ తమ చేతుల్లో వుండటంతో మూడు ముక్కల పేకాట బెట్టింగ్ సమయంలో తక్కువ మొత్తం పందెం పెట్టిన వారిని ముందుగా గెలిపించి వారితో ఎక్కువ మొత్తంలో డబ్బు పందెం కాసేవిధంగా ప్రోత్సహించేవారు. ఇలా ఎక్కువ డబ్బును పందెం కాసినప్పుడు వారిని ఓడిపోయేలా మోసం చేసేవారు. ఈ క్రమంలోనే ప్రసాద్ మరో ఇద్దరితో కల్సి ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా 2019లో హైదరాబాద్ కమిషనరేటకు చెందిన చందానగర్‌, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రామచంద్రపురం పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. జైలు నుండి విడుదలైన త‌ర్వాత‌ హైదరాబాద్లో తిరిగి అన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తే పోలీసులు గుర్తిస్తారని తన అత్తగారి ఊరు హన్మకొండకు ప్రసాద్ మకాం మార్చాడు.

- Advertisement -

హన్మకొండ కేంద్రంగా చేసుకోని ఐపిఎల్, టి20-20తో పాటు మూడు ముక్కల పేకాట ఆన్లైన్ బెట్టింగులు జోరుగా నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బును బీనామీ పేర్లపై బ్యాంకు ఖాతాల్లో జమచేయడంతో పాటు వివిధ స్థిరాస్తులను కొనుగోలు చేసారు. మోసపోయిన వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదులో నిందితులపై కేయూసి పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు, హన్మకొండ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదు అయ్యాయి. సెంట్రల్ జోన్ డిసిపి పుష్పా అధ్వర్యంలో కేయూసి, సైబర్ క్రైం పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేసి నిందితులను గుర్తించడం జరిగింది.

ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా వచ్చిన లాభాన్ని పంచుకోనేందుకుగా అభయ్ ఈరోజు (సోమవారం) ఉదయం ప్రసాద్ ఇంటికి వచ్చినట్లుగా కెయూసి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇన్స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి తన సిబ్బందితో వెళ్ళి వారిని అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో పాటు బ్యాంక్ పాస్ బుక్ లు, ఏటియం కార్డులు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్ జోన్ డిసిపి పుష్పారెడ్డి, కేయూసి ఇన్ స్పెక్టర్ జనార్ధన్ రెడ్డి, ఎస్ఐ సంపత్. ఏ.ఏ.ఓలు ప్రశాంత్, సల్మాన్ పాషా, హెడ్ కానిస్టేబుల్ మల్లారెడ్డి, కానిస్టేబుళ్లు అశోక్, మధు, జగదీష్, కమాలకర్ ను పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసంఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement