Thursday, April 25, 2024

Breaking: భారత్​–సౌతాఫ్రికా మ్యాచ్​.. సఫారీల టార్గెట్​ ఎంతంటే?

సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్​లో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. తొలి 5 ఓవర్లలోనే టాపార్డర్​ కుప్పకూలడంతో సఫారీలు మరింత జోష్​ పెంచారు. అయితే.. క్రికెట్​ అభిమానులంతా భారత్​ ఈ మ్యాచ్​ గెలిచి సెమీస్​లోకి అడుగుపెడుతుందని ఆశపడ్డారు. కానీ, ఇవ్వాల టీమిండియా ఆటతీరు అంత బాగాలేదనే అంటున్నారు పరిశీలకులు. సఫారీలు 134 పరుగులు చేయాల్సి ఉంది.

ఇక.. రాహుల్​ (9), రోహిత్​ శర్మ(15), కోహ్లీ (12), సూర్యకుమార్​ (68), దీపక్​ హుడా (0), హార్దిక్​ పాండ్యా (2), దినేశ్​ కార్తీక్​ (6), రవిచంద్రన్​ అశ్విన్​ (7), షమీ (0) పరుగులు చేశారు. కాగా, సౌతాఫ్రికా జట్టులోని బౌలర్లు పార్నెల్​కు 3 వికెట్లు, ఎన్​గిడీకి 4, నోర్తజీకి 1 వికెట్​ దక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement