ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో ఇవ్వాల (బుధవారం) టీమిండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. కాగా, టాస్ గెలిచిన బంగ్లా జట్టు కెప్టెన్ హకీబుల్ హసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. బంగ్లా టార్గెట్ 185 పరుగులుగా ఉంది.
అయితే.. ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ అంతగా రాణించలేదు. ఇన్నిరోజులు ఫామ్లో లేకుండా ఉన్నా కేఎల్ రాహుల్ ఇవ్వాల మంచి ఆటతీరు కనబరిచాడు. కోహ్లీ, రాహుల్ దంచికొట్టడంతో బంగ్లాకు మంచి టార్గెట్ పెట్టినట్టు అయ్యింది.