Saturday, April 20, 2024

మ‌హీభాయ్ నీకోసం ఏదైనా చేస్తా.. ట్వీట్ చేసిన ర‌వీంద్ర జ‌డేజా

ఐపీఎల్ 2023సీజ‌న్ విజేత‌గా నిలిచింది చెన్నై.. కాగా చివరి రెండు బంతుల్లో 10 పరుగులు చేయాల్సి ఉండగా.. 6, 4 మ్యాచ్ ను గెలిపించాడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. ఈ విజయాన్ని తన కెప్టెన్ కు కానుకగా అందించాడు. ఈ నేపథ్యంలో ధోనీని ఉద్దేశించి ట్విట్టర్ లో జడేజా ప్రత్యేక పోస్ట్ పెట్టాడు. ఇది కేవలం ఎంఎస్ ధోనీ కోసం మాత్రమే చేశాం. మహీ భాయ్‌ నీ కోసం ఏదైనా సరే.. అని రాసుకొచ్చాడు. రెండు హార్ట్ సింబల్స్ ను కూడా జత చేశాడు. తనను ధోనీ ఎత్తుకున్న, ధోనీతో కలిసి ట్రోఫీ అందుకున్న ఫొటోలను షేర్ చేశాడు..నా సొంత రాష్ట్రంలోని అభిమానుల మధ్య సీఎస్‌కే ఐదో టైటిల్‌ను గెలవడం అద్భుతంగా అనిపించింది. సీఎస్‌కేకు మద్దతుగా నిలవడానికి భారీగా తరలివచ్చిన అభిమానులకు ధన్యవాదాలు. ఈ అపూర్వ విజయాన్ని ఒకే ఒక వ్యక్తి కోసం అంకితం చేస్తున్నాం. మా కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ కోసమే గెలిచాం అని తన అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement