Thursday, April 18, 2024

పంత్‌లో నాలాగే ఆడుతున్నాడు: సెహ్వాగ్

టీమిండియా యువ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ పై డాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. రిషభ్ పంత్‌ను చూస్తుంటే తన కెరీర్ ప్రారంభ రోజులు గుర్తుకొస్తున్నాయని, సానుకూల దృక్పథం కలిగిన పంత్ లాంటి ఆటగాళ్లు జట్టులో ఉండటం మంచిదని వీరేంద్ర సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. తను మొదట్లో ఇలాగే ఆడేవాడినని పంత్ ఆటను చూస్తేంటే తనను తాను చూసుకున్నట్లు ఉందన్నారు. ఇతరులు ఏమనుకుంటున్నారనే విషయాన్ని పంత్ పట్టించుకోడు. తన ఆట తాను ఆడతాడిని సెహ్వాగ్ ప్రశంసించాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన వన్డేల సిరీస్‌లో అదరగొట్టాడు పంత్. ఈ సిరీస్‌లో రెండు వన్డేలు మాత్రమే ఆడిన పంత్ 151.96 స్ట్రైక్‌రేట్, 77.50 సగటుతో 155 పరుగులు చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement