Monday, March 25, 2024

చెన్నైలో ల్యాండ్ అయిన కింగ్..

ఐపీఎల్ 2021 సీజన్ కు టైం దగ్గర పడుతోంది. అన్ని జట్లు ఒక్కక్కటిగా చేరాల్సిన చోటుకి చేరుతున్నాయి. కింగ్ కోహ్లీ కూడా చెన్నై చేరాడు. ఇంగ్లండ్‌తో సిరీస్ త‌ర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఐపీఎల్‌లో ఆడేందుకు సిద్దమయ్యాడు. చెన్నైలో జట్టుతో కలిసిపోయాడు కింగ్ కోహ్లీ. అక్కడే జట్టుతో కలిసి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు విరాట్. కింగ్ కోహ్లి చెన్నై వ‌చ్చినట్లు ఆర్సీబీ ఓ ట్వీట్‌లో తెలిపింది. ఇవాళ ఇంట‌ర్నెట్‌ను మేము చాలా బ్రేక్ చేసేశాం అని మీరు అనుకుంటే మ‌రోసారి ఆలోచించండి. కెప్టెన్ కోహ్లి చెన్నై వ‌చ్చాడు అని ఆర్సీబీ కామెంట్ చేసింది. ఏప్రిల్ 9న ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో ముంబైతో ఆర్సీబీ త‌ల‌ప‌డ‌నుంది. దీనికి ముందు కోహ్లి వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండ‌నున్నాడు. కింగ్ కోహ్లీ రాకతో జట్టు వాతావరణంలో మార్పు వచ్చిందని ఆటగాళ్లు అంటున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement