Thursday, April 25, 2024

అరుదైన ఘనత సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ.. అభినందించిన అనుష్క‌

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ తన వందో టెస్టులో అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 8వేల పరుగులు పూర్తిచేశాడు కోహ్లీ. దీంతో ఈ ఘనతను సాధించిన 6వ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ జాబితాలో సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ కోహ్లీ కంటే ముందున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా దిగ్గజ సారథి రికీ పాంటింగ్ సైతం తన వందో టెస్టులోనే 8వేల పరుగుల మైలురాయిని చేరుకోవడం విశేషం. కాగా, విరాట్ కోహ్లీని త‌న భార్య అనుష్క శ‌ర్మ అభినందించారు. స్టేడియంలో త‌న‌తో క‌లిసి కాసేపు న‌డిచి అంద‌రినీ సంతోష‌పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement