Thursday, April 18, 2024

రూ.951కోట్ల బిడ్డింగ్ తో వ‌యాకామ్ 18కి మ‌హిళా ఐపిఎల్ ప్ర‌సార హ‌క్కులు..

ముంబై… ఈ ఏడాది నుంచి మ‌హిళా ఐపిఎల్ ను బిసిసిఐ నిర్వ‌హించ‌నుంది.. ఈ మ్యాచ్ ల ప్రసార హ‌క్కుల కోసం బిడ్స్ ను ఆహ్వానించింది..వ‌యాకామ్,జీ, సోనీ,డిస్నీ స్టార్ తో స‌హా మొత్తం అయిదు సంస్థ‌లు ఈ బిడ్ లో పాల్గొన్నారు.. నేడు ముంబైలో ఈ బిడ్ ల‌ను తెరిచారు. అధిక ధ‌ర‌కు బిడ్ వేసిన‌ లీగ్ మీడియా హక్కులను వయాకామ్ 18 ద‌క్కించుకుంది.. ఈ మేరకు బీసీసీఐ కార్యదర్శి జై షా సోషల్ మీడియాలో ప్రకటించారు. వయాకామ్ 18 రూ. 951 కోట్ల బిడ్డింగ్ ద్వారా 2023 నుంచి 2027 వరకు హక్కులను కొనుగోలు చేసింది. మ‌హిళా క్రికెట్ మ్యాచ్ ల ప్ర‌సార హ‌క్కుల‌కు భారీగా ఆదాయం రావ‌డంపై జై షా స్పందిస్తూ. మహిళల క్రికెట్‌కు ఇది చారిత్రాత్మకమని అభివర్ణించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement