Thursday, April 25, 2024

Breaking: ఉచకోత, ఫామ్​లోకి వచ్చిన కోహ్లీ.. ప్లే ఆఫ్స్​లో బెంగళూరుకు చోటు

గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు ధాటిగా ఆడుతోంది. అంతకుముందు హార్దిక్ పాండ్యా రాణించడంతో గుజరాత్ జట్టు 168 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ, డుప్లెసిస్ ఇద్దరూ ధాటిగా ఆడి బెంగళూరుకు శుభారంభం అందించారు. కోహ్లీ మంచి టచ్‌లో కనిపించగా.. డుప్లెసిస్ అతనికి మంచి సహకారం అందించాడు.

అయితే.. 14.3వ ఓవర్లలో 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డూప్లిసెస్​ క్యాచ్​ అవుటయ్యాడు. అయినా జోరుమీదున్న కోహ్లీకి మ్యాక్స్ వెల్​ జతకాడంతో పరుగులు వరద పారింది. మ్యాక్స్​వెల్​ బ్యాటింగ్​ చేస్తుంటే స్డేడియంలో ఆర్​సీబీ, ఆర్​సీబీ అన్న కేకలు, అరుపులు మారుమోగాయి.. కాగా, 16.3 ఓవర్​ వద్ద కోహ్లీ పుల్​ చేయబోయి కీపర్​కు దొరికిపోయాడు. దీంతో కోహ్లీ 73 పరుగులు చేసి ఈ మ్యాచ్​లో టీమ్​కు మాంచి తోడ్పాటునందించాడు.

కాగా, మ్యాక్స్​వెల్​ 40, దినేశ్​ 2 కార్తీక్​ ఇద్దరూ చివరి దాకా ఆడి బెంగళూరుకు విజయాన్ని అందించారు. ఎనిమిది వికెట్ల విజయం సాధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement