Thursday, April 25, 2024

Cricket: బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ పదవి రేసులో ఇద్దరి పేర్లు

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఓట‌మి త‌ర్వాత చేతన్‌ శర్మ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీపై వేటు ప‌డింది. ఈ కమిటీకి హర్విందర్‌ సింగ్‌ (సెంట్రల్‌ జోన్‌), సునీల్‌ జోషి (సౌత్‌ జోన్‌), దేబశిష్‌ మొహంతి (ఈస్ట్‌ జోన్‌) సభ్యులుగా ఉన్నారు. వీరి పదవీకాలం మరికొంతకాలం ఉన్నా బీసీసీఐ కమిటీని రద్దు చేసి, కొత్త సెలక్షన్‌ కమిటీ నియామకం కోసం నోటిఫికేషన్‌ జారి చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 28 వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు గడువు విధించింది.

ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడబోయే సెలక్షన్‌ కమిటీలో ఎవరెవరు ఉండబోతున్నారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బీసీసీఐ ఉనత వర్గాల సమాచారం మేరకు చీఫ్‌ సెలెక్టర్‌ పదవి రేసులో ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. భారత మాజీ లె గ్‌ స్పిన్నర్‌ లక్ష్మణ్‌ శివరామ కృష్ణన్‌, మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌ చీఫ్‌ సెలెక్టర్‌ పదవి కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
వీరిలో 2020లో దరఖాస్తు చేసుకున్న శివరామ కృష్ణన్‌ బీసీసీఐ బాస్‌ రోజర్‌ బిన్ని, కార్యదర్శి జైషాల అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement