Thursday, March 28, 2024

నేడు క్వార్టర్స్‌లో భారత్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌..

అండర్‌-19 ప్రపంచకప్‌లో భాగంగా నేడు యువ భారత్‌ అంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. కొవిడ్‌ బారిన పడిన భారత ఆటగాళ్లు కోలుకుని శనివారం జరిగే క్వార్టర్‌ ఫైనల్‌కు ఆడనుండటం టీమిండియాకు శుభపరిణామం. కెప్టెన్‌ యశ్‌తోసహా వైస్‌కెప్టెన్‌ షేక్‌ రషీద్‌, సిద్ధార్థ్‌ యాదవ్‌, ఆరాధ్య యాదవ్‌, మానవ్‌.. మొత్తం 6మంది ఆటగాళ్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ ముంగిట ఈ ఘటన జరిగింది. వీరంతా కోలుకుని నేటి మ్యాచ్‌లో ఆడనున్నారు. కరోనా నుంచి కోలుకున్న ఆటగాళ్లు నేటి మ్యాచ్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నారని బీసీసీఐ అధికారులు మీడియాకు తెలిపారు. సాయంత్రం 6.30నిమిషాలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement