Saturday, April 20, 2024

Breaking: విండీస్‌తో మూడో వ‌న్డే.. టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా..

వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా టాస్ గెలిచింది. దీంతో కెప్టెన్ ధ‌వన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి నాలుగు ఓవ‌ర్ల‌లో ఇండియా వికెట్లేమీ కోల్పోకుండా 14 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం క్రీజ్‌లో ఓపెన‌ర్లు శిఖ‌ర్ ధ‌వ‌న్‌, శుభ్‌మ‌న్‌గిల్ ఆడుతున్నారు..

ఇక‌.. మూడు వన్డేల సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో గెలిచిన భారత్ ఇప్పటికే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. రెండు మ్యాచుల్లోనూ గట్టిపోటీ ఇచ్చిన వెస్టిండీస్ జట్టు ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉంది. తమ జట్టులో ఒకే మార్పు ఉందని, ఆవేష్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ ఆడుతున్నాడని ధవన్ వెల్లడించాడు. జడేజా పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో అతను మూడో వన్డేలో అందుబాటులో లేడని, మెడికల్ టీం పర్యవేక్షణలో ఉన్నాడని బీసీసీఐ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement