Friday, April 19, 2024

షేన్‌ వార్న్ కు కన్నీటి వీడ్కోలు.. అంత్యక్రియలు పూర్తి

క్రికెట్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి షేన్‌ వార్న్‌ కుటుంబ సభ్యులతో పాటు 80 మంది ఇతరులు హాజరయ్యారు. బరువెక్కిన హృదయంతో షేన్‌ వార్న్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు. అంత్యక్రియల్లో షేన్‌ వార్న్‌ తల్లిదండ్రులు కీత్‌, బ్రిగెడ్‌తో పాటు ముగ్గురు పిల్లలు పాల్గొన్నారు. అదేవిధంగా అతనితో సన్నిహితంగా ఉండే.. ఆండ్రూ సైమండ్స్‌, మైకేల్‌ క్లార్క్‌, మార్క్‌ టేలర్‌, మెర్వ్‌ హ్యూస్‌, గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌, మెర్వ్‌ హ్యూస్‌తో పాటు పలువురు తాజా, మాజీ క్రికెటర్లు అంత్యక్రియలకు హాజరయ్యారు.

30న మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆధ్వర్యంలో షేన్‌ వార్న్‌ అధికారిక స్మారక సభను నిర్వహించనున్నారు. ఈ స్మారక సభకు షేన్‌ వార్న్‌ కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, అనేక మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశాలున్నాయి. మెల్‌బోర్న్‌తో షేన్‌వార్న్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది. వార్న్‌ పుట్టి పెరిగిందంతా మెల్‌బోర్న్‌లోనే. 1994లో యాషెస్‌ సిరీస్‌లో హ్యాట్రిక్‌ వికెట్లు ఇక్కడే సాధించాడు. 52 ఏళ్ల షేన్‌ వార్న్‌ థాయ్‌లాండ్‌లోని ఓ విల్లాలో ఈనెల 4వ తేదీన చనిపోయిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement