Thursday, April 25, 2024

Breaking: జింబాబ్వేపై టీమిండియా భారీ విజయం.. గ్రూప్​ బి నుంచి సెమీస్​లో భారత్​, పాకిస్తాన్​

టీ20 వరల్డ్​కప్​లో భాగంగా ఇవ్వాల లీగ్​ దశలో ఆఖరిగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్​లో టీమిండియా భారీ విజయం సాధించింది. దీంతో సెమీస్​లోకి అడుగుపెట్టినట్టయ్యింది.  ఇవ్వాల జరిగిన మ్యాచ్​లో సూర్యకుమార్​ యాదవ్​ అతితక్కువ బంతుల్లో 25 బంతుల్లో 61 పరుగులతో అద్భుతంగా రాణించాడు. ఒక సిక్స్​ అయితే కూర్చొని కొట్టగా.. అది గ్యాలరీలో పడడంతో అంతా సంతోషంగా సందడి చేశారు. ఇండియా 71 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

ఇక.. గ్రూప్​ బి నుంచి ఇవ్వాల మూడు మ్యాచ్ లు జరిగాయి. అందులో భారత్​ గెలుపొందగా.. పాకిస్తాన్​, బంగ్లా.. నెదర్లాండ్స్​, సౌతాఫ్రికా మ్యాచ్​లలో  పాకిస్తాన్​ బంగ్లాదేశ్​పై గెలిచింది. కాగా, నెదర్లాండ్స్​పై సౌతాఫ్రికా ఓటమిచెందింది. దీంతో లీగ్​ దశలోనే సౌతాఫ్రికా ఔట్​ అయినట్టు తెలుస్తోంది. మొత్తానికి గ్రూప్​ బి నుంచి టీమిండియా, పాకిస్తాన్​ సెమీస్​కు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే గ్రూప్​ ఏ  నుంచి న్యూజిలాండ్​ ఇంగ్లండ్​జట్లు సెమీస్​కు చేరుకున్నాయి.

కాగా, బుధవారం జరిగే తొలి సెమీ ఫైనల్స్​లో పాకిస్తాన్, న్యూజిల్యాండ్​ జట్లు తలపడనున్నాయి.

గురువారం జరిగే సెకండ్​ సెమీస్​లో భారత్​, ఇంగ్లండ్​ జట్ల మధ్య మ్యాచ్​ ఉండనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement