Wednesday, March 27, 2024

Breaking: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా… ఆల‌స్యంగా ప్రారంభమైన వ‌న్డే మ్యాచ్‌

భార‌త్‌లో టూర్‌లో సౌతాఫ్రికా క్రికెట్ జ‌ట్టుతో టీమిండియా తొలి వ‌న్డే మ‌రికాసేప‌ట్లో ప్రారంభం కానుంది. ల‌క్నోలోని అట‌ల్ బిహరీ వాజ్‌పేయి స్టేడియంలో జ‌రగ‌నున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. ప‌ర్యాట‌క జ‌ట్టును ఫ‌స్ట్ బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. వాస్త‌వానికి ఇవ్వాల మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కే మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండ‌గా భారీ వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్​ ఆలస్యంగా ప్రారంభమైంది. కాగా, సౌతాఫ్రికా 3 ఓవర్లకు 12 పరుగులు చేసింది.

ఇక‌.. లేట్ కార‌ణంగా మ్యాచ్ ని 40 ఓవ‌ర్ల‌కే కుదించారు. ఈ మ్యాచ్‌లో భార‌త జ‌ట్టు కెప్టెన్‌గా శిఖ‌ర్ ధావ‌న్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. రెగ్యుల‌ర్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌కు విశ్రాంతి నేప‌థ్యంలో బీసీసీఐ శిఖ‌ర్‌ధావ‌న్‌కి కెప్టెన్సీ అప్ప‌గించింది. మొత్తం 3మ్యాచ్‌ల‌తో కూడిన ఈ సిరీస్‌లో తొలి వ‌న్డే ఇవ్వాల జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే టీ20 సిరీస్‌ను గెలిచిన టీమిండియా వ‌న్డే సిరీస్‌లోనూ ఫేవ‌రెట్‌గా బరిలోకి దిగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement