Friday, April 19, 2024

Big Breaking: న్యూజిలాండ్​తో టీ20.. సెకండ్​ మ్యాచ్​లో టీమిండియా ఘన విజయం

న్యూజిలాండ్​ పర్యటనలో భాగంగా ఇవ్వాల (ఆదివారం) జరిగిన టీ20 సెకండ్​ మ్యాచ్​లో భారత్​ జట్టు అద్భుత ప్రదర్శన కొనసాగింది. అటు బ్యాటింగ్​, ఇటు బౌలింగ్​ పరంగా బెస్ట్​గా నిలిచింది. టీమిండియా బ్యాటర్​ సూర్యకుమార్​ యాదవ్​ 51 బంతుల్లో సెంచరీ (111*) పరుగులు నమోదు చేసుకుని రికార్డు సాధించగా.. ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది భారత జట్టు..

ఇక.. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 126/10తో ఓటమి చెందింది. ఇందులో భువనేశ్వర్​ 1, మహ్మద్​ సిరాజ్​ 2, వాషింగ్​టన్​ సుందర్​ 1, చాహల్​2, దీపక్​ హుడా 4 వికెట్లు తీసి న్యూజిలాండ్​ వెన్నువిరిచేశారు. కాగా, కేన్​ విలియమ్స్​ (61), డివోన్​ కాన్​వాయ్​ (25), ఫిలిప్స్​ (12), మిచ్చెల్​ (10) పరుగులు మినహా.. మరే ఇతర ఆటగాడు పెద్దగా స్కోరు చేయలేక చేతులెత్తేశారు. దీంతో భారత జట్టు 65 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement