Thursday, April 25, 2024

శార‌దా పీఠాన్ని స‌తీస‌మేతంగా సంద‌ర్శించిన కేఎస్ భ‌ర‌త్

స‌తీస‌మేతంగా విశాఖ శార‌దా పీఠాన్ని సంద‌ర్శించారు టీమిండియా టెస్టు టీమ్ వికెట్ కీపర్‌ కేఎస్‌ భరత్ . రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామిని కలిసి ఆయన ఆశీర్వచనాలు అందుకున్నారు. ఐపీఎల్‌‌లో గుజరాత్‌ టైటాన్స్‌ తరఫున మ్యాచ్‌లు ఆడేందుకు అహ్మదాబాద్‌ వెళ్తున్నట్లు భరత్‌ స్వామీజీకి తెలియజేశారు.

అమ్మవారి అనుగ్రహం, పీఠాధిపతుల ఆశీస్సుల కోసం విశాఖ శ్రీ శారదాపీఠాన్ని సందర్శించానని చెప్పారు. కేఎస్ భరత్ ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆడారు.
మరోవైపు విశాఖలో ఈ నెల 19న జరగనున్న భారత్‌, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్‌కు విజయనగరం జిల్లాచకు చెందిన తోట విజయ్‌ను స్కోరర్‌గా నియమించినట్లు ఆంధ్రా క్రికెట్‌ సంఘం ప్రకటించింది. ఇప్పటికి నాలుగు టీ-20లు, తొమ్మిది వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు, 13 ఐపీఎల్‌ మ్యాచ్‌లకు విజయ్ స్కోరర్‌గా సేవలు అందించారు. అలాగే 350కి పైగా పోటీలకు అంపైర్‌గా విజయ్ వ్యవహరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement