Friday, April 26, 2024

Cricket: ఇవ్వాల టీ20 టఫ్​ ఫైట్​​.. నాగ్​పూర్​ స్టేడియంలో మరికొద్ది సేపట్లో మ్యాచ్​

టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇవ్వాల రెండో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్​ ఈ రాత్రి 7 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానుంది. మహారాష్ట్రలోని నాగ్​పూర్​ స్టేడియంలో మ్యాచ్​ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే.. మూడు మ్యాచ్​ల సిరీస్​లో తొలి మ్యాచ్​లో ఆస్ట్రేలియా గెలుపొంది 1.0 ఆధిక్యంలో ఉంది. ఇవ్వాల టీమిండియా గెలుపొందాలని భారత అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక.. తదుపరి మ్యాచ్​ హైదరాబాద్​లోని ఉప్పల్​ స్టేడియంలో జరగనుంది.

దీనికి సంబంధించిన టిక్కెట్ల కోసం పెద్ద ఎత్తున గందరగోళం నెలకొంది. ఒకదశలో నిన్న టిక్కెట్ల కొనుగోల కోసం జింఖానా గ్రౌండ్స్​లో తొక్కిసలాట జరిగింది. గేట్లను తోసుకుని వచ్చిన క్రికెట్​ అభిమానులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీ చార్జి చేయాల్సి వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement