Thursday, April 25, 2024

Breaking: పాకిస్తాన్​పై శ్రీలంక విజయం.. తక్కువ టార్గెట్​​ అయినా చేజింగ్​లో తడబాటు!

ఆసియాకప్​లో భాగంగా పాకిస్తాన్​ జరిగిన సూపర్​ 4 మ్యాచ్​లో శ్రీలంక విజయకేతనం ఎగరేసింది. మొన్న భారత్​తో జరిగిన మ్యాచ్​లో గెలిచిన జోష్​లో ఉన్న శ్రీలంక జట్టు ఇవ్వాల అదే ఆటతీరును ప్రదర్శించి పాక్​ని చిత్తు చేసింది. టీ20లో భాగంగా తొలుత పాకిస్తాన్​ బ్యాటింగ్​ చేయగా.. 121 పరుగులకే ఆల్​ అవుటయ్యింది. ఆ టీమ్​లో ఒక్క బాబర్​ ఆజామ్​ మాత్రమే (30) మెరుగైన ఆటతీరు కనబరిచాడు. ఆ తర్వాత మహ్మద్​ నవాజ్​ (26) పర్వాలేదనిపించాడు. ఇక ఆ తర్వాత మిగతా ఆటగాళ్లు లంక బౌలర్ల ముందు తలవంచి పెవిలియన్​కు క్యూకట్టారు. ఇద్దరు డక్​ అవుట్​ కాగా, మిగతా వారిలో చాలామంది 14, 13 పరుగులకే అవుటయ్యారు.

కాగా, సెకండ్​ ఇన్నింగ్స్​లో బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టులో ఓపెనర్​ నిసాంకా 55 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. చివరిదాకా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మెండిస్​, గుణతిలక డకౌట్లు కాగా, నిసాంక మాత్రం నిదానంగా ఆడుతూ వికెట్లు పడకుండా తనవంతు ప్రయత్నం చేశాడు. రాజపక్స (24), షనాకా (21), హసరంగ 10 పరుగులు చేసి నాటౌట్​గా నిలిచాడు. మొత్తానికి తక్కువ టార్గెట్​ అయినా ఛేజింగ్​లో లంక కాస్త ఇబ్బందులకు గురయ్యింది. 5 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement