Friday, March 15, 2024

Big Breaking | శుభ్​మన్​ గిల్​ సెంచరీ.. అహ్మదాబాద్​లో పరుగుల వరద!

 న్యూజిలాండ్​తో జరుగుతున్న టీ20 టఫ్​ మ్యాచ్​లో టీమిండియా దంచికొడుతోంది. మొదటి నుంచి హిట్టింగ్​ మూడులోనే ఉన్న భారత బ్యాట్స్​మన్​.. ఒక్కో ఓవర్​కి 10 పరుగులకు తక్కువ కాకుండా రాబట్టారు. అయితే.. మొదట ఒవర్​ దాటిన వెంటనే ఓపెనర్​ ఇషాన్​ కిషన్​ (1) పరుగుకే అవుటయ్యాడు. ఆ తర్వాత శుభ్​మన్​ గిల్​కు తోడుగా రాహుల్​ త్రిపాఠి (44) వచ్చాడు.  ఎనిమిదో ఓవర్​లో 87 పరుగుల వద్ద త్రిపాఠి పెవిలియన్​ చేరడంతో సూర్యకుమార్​ యాదవ్​ క్రీజ్​లోకి ఎంట్రీ ఇచ్చాడు. 12ఓవర్​లో 125 పరుగుల వద్ద సూర్యకుమార్​ (24)పరుగులకు అవుటయ్యాడు.

కాగా, అప్పటికే ఓపెనర్​గా వచ్చిన గిల్​ మాంచి ఫామ్​లో ఉండడంతో దబిడ దిబిడ అనించాడు. చివరగా కెప్టెన్​ హార్దిక్​ పాండ్యాతో కలిసి స్కోరు బోర్డుని పరుగులు పెట్టించి 17వ ఓవర్​లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ క్రమంలో పాండ్యా కూడా సిక్సులు, ఫోర్లు బాదుతూ స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. ఇట్లా 19వ ఓవర్​ వరకు 228 పరుగుల స్కోరు అయ్యింది. కాగా సిక్స్​ కొట్టబోయిన హార్దిక్​ పాండ్యా (30) పరుగుల వద్ద బోర్డర్​లో క్యాచ్​ అవుటయ్యాడు. దీపక్​ హుడా 2* తో కలిసి ఆఖరి ఓవర్​ ఆడిన గిల్​ 126* పరుగులతో నాటౌట్​గా నిలిచాడు. భారత్​ మొత్తం స్కోరు నాలుగు వికెట్లు కోల్పోయి.. 234 పరుగులు చేయగా, న్యూజిలాండ్​ టార్గెట్​ 235 పరుగులుగా ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement