Friday, April 19, 2024

ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌ ఆడనున్న శ్రేయస్‌..‌

ఇంగ్లండ్‌ కౌంటీ క్రికెట్‌ లాంకషైర్‌ కౌంటీ జట్టు తరఫున భారత్ ఆటగాడు శ్రేయస్ అయ్యారు ఆడనున్నాడు. ఇంగ్లండ్‌ దేశవాళీ వన్డే టోర్నీ రాయల్‌ లండన్‌ కప్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో శ్రేయస్ అయ్యారు బరిలోకి దిగనున్నాడు. జూలై 15న అయ్యర్‌ జట్టుతో చేరతాడు. ఈ టోర్నీ కోసం నెల రోజుల పాటు ఇంగ్లాండులోనే ఉండనున్నాడు. గ్రూప్‌ దశ మ్యాచ్‌లకు అతను అందుబాటులో ఉండే అవకాశం ఉంది. సాధారణంగా కౌంటీల్లో ఎంతో గుర్తింపు ఉన్న నాలుగు రోజుల ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ల కోసం కాకుండా అయ్యర్‌ ప్రత్యేకంగా వన్డేల కోసం మాత్రమే లాంకషైర్‌తో జత కట్టాడు. గతంలో భారత్‌ నుంచి ఫరూఖ్‌ ఇంజినీర్,  లక్ష్మణ్,  గంగూలీ ఈ కౌంటీ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement