Saturday, April 20, 2024

శ్రేయస్‌ అయ్యర్‌ అరుదైన రికార్డు

ఈ ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్‌లు కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా శ్రేయస్‌ అయ్యర్‌ నిలిచాడు. 21 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద అయ్యర్‌ ఈ రికార్డు సాధించాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో 36 ఇన్నింగ్స్‌లు ఆడి 1486 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 82 పరుగులతో అయ్యర్‌ ఇంకా క్రీజులో ఉన్నాడు.

ఇక అంతకు ముందు ఈ రికార్డు భారత విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ పేరిట ఉండేది. సూర్య ఈ ఏడాది అన్ని ఫార్మాట్‌ల్లో కలిపి 43 ఇన్నింగ్స్‌లలో 1424 పరుగులు సాధించాడు. తాజా మ్యాచ్తో సూర్య రికార్డును అయ్యర్‌ బ్రేక్‌ చేశాడు. సూర్య తర్వాతి స్థానంలో భారత వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ 1232 పరుగులతో ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement