Wednesday, April 24, 2024

రికార్డు ముగింట సానియా మీర్జా..

సానియా మీర్జా ఇప్పుడు ఒలింపిక్స్‌లో చ‌రిత్ర సృష్టించ‌బోతోంది. 34 ఏళ్ల సానియా ఇండియా త‌ర‌ఫున నాలుగు ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వ‌హించిన తొలి మ‌హిళా అథ్లెట్‌గా నిల‌వ‌బోతోంది. జులై 23 నుంచి ప్రారంభం కానున్న ఈ గేమ్స్ కోసం సానియా ముమ్మ‌రంగా సాధ‌న చేస్తోంది. రికార్డు స్థాయిలో నాలుగోసారి ఇండియా త‌ర‌ఫున ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వ‌హించ‌డం త‌న‌కు గ‌ర్వంగా ఉన్న‌ద‌ని సానియా చెప్పింది. ఒలింపిక్స్ కోసం ఆతృత‌గా ఎదురుచూస్తున్న‌ట్లు తెలిపింది. తొలిసారి టాప్ 100లోపు ఉన్న ఇండియ‌న్ ప్లేయ‌ర్‌తో క‌లిసి సానియా డ‌బుల్స్ బ‌రిలోకి దిగుతోంది. రానున్న ఒలింపిక్స్‌లో డ‌బుల్స్ ఈవెంట్‌లో 95వ ర్యాంక్‌లో ఉన్న అంకితా రైనాతో క‌లిసి బ‌రిలోకి దిగ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement