Friday, April 19, 2024

ఆక్సిజన్ కోసం..సచిన్‌ కోటి విరాళం

కరోనా బాధితులకు సహాయం అందించేందుకు తమ వంతుగా వితరణ ఇచ్చేందుకు ఐపీఎల్‌ టీమ్‌లు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ టీమ్ మెనేజ్ మెంట్ రూ. 7.5 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమన్యం కూడా రూ. 1.5 కోట్లు ప్రకటించింది. టీమ్‌ సహ యజమానులు తమ జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్, వరలక్ష్మి ఫౌండేషన్‌ తరఫున ఈ మొత్తాన్ని అందిస్తున్నారు. ఢిల్లీకి చెందిన రెండు ఎన్జీఓలకు ఈ విరాళం ఇస్తున్నామని… సరైన రీతిలో ఈ నిధులు వినియోగం అయ్యేలా ఆ రెండు సంస్థలు బాధ్యత తీసుకుంటాయని ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పష్టం చేసింది.

ఇక కరోనా బాధితులకు ప్రాణవాయువు అందించేందుకు సచిన్‌ టెండూల్కర్‌ రూ. కోటిని విరాళంగా అందజేశాడు. కొవిడ్‌ కారణంగా ఆక్సిజన్‌ అందక ఇబ్బంది పడుతున్న వారి సహాయార్థం ‘మిషన్‌ ఆక్సిజన్‌’ ఈ నిధులను సేకరిస్తోంది. 250 మందికి పైగా యువ వ్యాపారవేత్తలు ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల కోసం ఈ గ్రూప్‌ను ఏర్పాటు చేశారు. సచిన్‌ కూడా కోవిడ్‌ బారినపడి కోలుకొన్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement