Saturday, April 20, 2024

భార‌త్ ను ఆదుకున్న రోహిత్,రెహానే…తొలి రోజు 300/6

చెన్నై: హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌, వైస్ కెప్టెన్ అజింక్య రెహానే బ్యాటింగ్ మెరుపుల‌తో తొలిరోజు భార‌త్ ను మెరుగైన స్థితిలో ఉంచారు.. చెపాక్ వేదికగా ఇంగ్లండ్‌తో ప్రారంభ‌మైన‌ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోతొలి రోజున‌ 88 ఓవర్లలో టీమిండియా స్కోర్ ఆరు వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి సెషన్‌లో ఓపెనర్ శుభ్‌మన్ గిల్‎తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా డకౌట్లుగా వెనుదిరగడంతో జట్టు కష్టాల్లో పడింది. దానికి తోడు టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా(21) కూడా తక్కువ పరుగులకే అవుట్ కావడంతో టీమిండియా 106 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఇలాంటి తరుణంలో ఓపెనర్ రోహిత్ శర్మ 231 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లతో (161) పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. అతడికి తోడు ఆజింక్య రహానే 149 బంతుల్లో 9 ఫోర్లతో (67) రన్స్ చేసి క్రీజులో నిలదొక్కుకోవడంతో భారత్ భారీ స్కోర్ చేయగలిగింది. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోర్: 300/6తో ఉంది. ప్రస్తుతం క్రీజులో రిషబ్ పంత్ (33), పటేల్ (5)తో అజేయంగా నిలిచారు. ఇంగ్లండ్ బౌల్లరలో లీచ్, మొయిన్ అలీ రెండు వికెట్లు తీయగా స్టోన్, రూట్ లకు తలో వికెట్ దక్కాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement