Wednesday, April 24, 2024

నెట్స్‌లో రోహిత్‌ ప్రాక్టీస్‌ షురూ.. సౌథాఫ్రికా టూర్‌కు స‌న్న‌ద్ధం..

న్యూఢిల్లి: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహిత్‌శర్మ, సీనియర్‌ పేసర్‌ షమీ నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. ఈ నెలలో దక్షిణాఫ్రికా సిరీస్‌ ప్రారంభం కానుంది. ముందుగా టెస్టు సిరీస్‌ ఆరంభంకానున్న నేపథ్యంలో వీరిద్దరూ ప్రాక్టీస్‌ షురూ చేశారు. ఓపెనర్‌ రోహిత్‌శర్మ త్రోడౌన్‌ స్పెషలిస్టులు విసిరిన బంతులను సమర్థంగా ఎదుర్కొన్నాడు. దక్షిణాఫ్రికా పేసర్లను ఎదురొడ్డి పరుగులు రాబట్టేందుకు హిట్‌మ్యాన్‌ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

మరోవైపు పేసర్‌ షమీ కూడా నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఎ)లో బౌలింగ్‌ ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. సఫారీ జట్టుతో జరిగే టెస్టు సిరీస్‌కు కోహ్లీ కెప్టెన్‌గా, రోహిత్‌శర్మ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఫామ్‌ కోల్పోయిన రహానెను టెస్టుల్లో వైస్‌ కెప్టెన్సీని నుంచి తొలగించి రోహిత్‌కు అప్పగించిన సంగతి విదితమే. కాగా ఈ నెల 26నుంచి సెంచూరియన్‌ వేదికగా భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ప్రారంభంకానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement