Saturday, April 20, 2024

ఐపీఎల్‌ లో రోహిత్‌ శర్మ ఒక్కడికే..

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో ఒక జట్టుపై వెయ్యి పరుగుల సాధించిన తొలి ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడు. కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ అరుదైన ఘనత అందుకున్నాడు. ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌ రెండో బంతిని ఫోర్‌ కొట్టిన రోహిత్‌ కేకేఆర్‌పై వెయ్యి పరుగులు మైలురాయిని అందుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా రోహిత్‌ రికార్డులకెక్కాడు. ఇక రోహిత్‌ తర్వాతి స్థానంలో డేవిడ్‌ వార్నర్‌ 943, 913 పరుగులతో(కేకేఆర్‌, పంజాబ్‌ కింగ్స్‌), విరాట్‌ కోహ్లి 909 పరుగులు(ఢిల్లీ క్యాపిటల్స్‌) వరుసగా ఉన్నారు. కేకేఆర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓటమి పాలైంది.

ఇది కూడా చదవండి: బిర్యానీ బిల్లు రూ.27 లక్షలు ..!

Advertisement

తాజా వార్తలు

Advertisement