Friday, March 29, 2024

వామ్మో వీర బాదుడు.. సీజన్‌లోనే హై స్కోరు చేసిన రాజస్థాన్.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు దంచికొట్టారు. ఓపెనర్లు జోస్ బట్లర్ (116), దేవదత్ పడిక్కల్ (54) ఇద్దరూ ఆ జట్టుకు అద్భుతమైన ఓపెనింగ్స్‌ అందించారు. పడిక్కల్‌ను ఖలీల్ అహ్మద్ అవుట్ చేయడంతో ఢిల్లీ జట్టు కొంత ఊపిరి పీల్చుకుంది. అయితే వారి సంతోషం కాసేపు మాత్రమే మిగిలింది. ఎందుకంటే పడిక్కల్ అవుటవడంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజు శాంసన్ (19 బంతుల్లో 46 నాటౌట్) చెలరేగాడు. 18వ ఓవర్ చివరి బంతికి అతను ఇచ్చిన క్యాచ్‌ను ఖలీల్ అహ్మద్ జారవిడిచాడు. అప్పటికి 13 బంతుల్లో 28 పరుగులు చేసి ఉన్న శాంసన్.. ఆ తర్వాత ఆరు బంతుల్లో 18 పరుగులు చేశాడు.

శార్దూల్ ఠాకూర్ వేసిన చివరి ఓవర్ చివరి రెండు బంతులకు ఫోర్, సిక్సర్ కొట్టాడు. దీంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముస్తాఫిజుర్ చెరో వికెట్ తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement