బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఓటమి పాలయ్యారు. దక్షిణకొరియా షట్లర్ ఆన్ సియోంగ్ చేతిలో 16-21, 12-21 తేడాతో ఓడిపోయారు. సింధు డిఫెన్సివ్గా గేమ్ మొదలు పెట్టడం దక్షిణ కొరియా షట్లర్కు కలసి వచ్చింది. దీంతో తొలి సెట్ను 16-21 తేడాతో ఓటమి పాలైంది. మొదటి గేమ్ చివరిలో సింధు పుంజుకుని ప్రతిఘటించినా సౌత్ కొరియా షట్లర్ సియోంగ్ తనదైన స్మాష్ షాట్లతో తొలి గేమ్ను గెలుపొందింది.
ఇక రెండో గేమ్ మొదట్లో సింధు గట్టిపోటీ ఇచ్చింది. అయితే, సింధుకు సియాంగ్ ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. అయితే, ఫైనల్స్లో ఓడిన సింధు సిల్వర్ మెడల్ సాధించింది. అంతకుముందు జరిగిన సెమీస్లో సింధు 21-15 15-21 21-19 తేడాతో జపాన్కు చెందిన అకానె యమగుచిని ఓడించి ఫైనల్లో అడుగు పెట్టింది. ముగింపు టోర్నీ వరల్డ్టూర్ టైటిల్ను మూడేళ్ల క్రితం 2018లో కైవసం చేసుకుంది.