Tuesday, April 23, 2024

లెహంగాలో పీవీ సింధు.. ఏం చేసిందంటే..

బ్యాడ్మింట‌న్ స్టార్ పీవీ సింధు త‌న డ్యాన్స్ ట్యాలెంట్‌ను చూపించింది. కంచీపురం లెహెంగా వేసుకున్న సింధు చాలా కూల్‌గా.. ఆ పాట‌కు త‌గ్గ‌ట్టు మూమెంట్స్ ఇచ్చింది. ఈ వీడియోను తానే స్వయంగా ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే ఆ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

బ్యాడ్మింటన్ వ్యక్తిగత విభాగంలో ఇండియాకు రెండు సార్లు ఒలింపిక్స్ పతకాలను అందించింది సింధు. 2016 రియో ఒలింపిక్స్ లో రజత పతకం, 2021 టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతకాలు సాధించింది. తన సత్తా ఏంటో చూపించింది. దీంతో ఆమెకు 2020 సంవత్సరానికి గాను కేంద్రప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. సింధు నిన్న ఢిల్లీలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement