Friday, April 19, 2024

IPL | దంచికొట్టిన ధవన్​.. రాజస్థాన్​ టార్గెట్​ ఎంతంటే?

రాజస్థాన్​ రాయల్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో పంజాబ్​ కింగ్స్​ దూకుడుమీదుంది. ఈ మ్యాచ్ లో శిఖర్​ ధవన్​ దంచికొట్టాడు. టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న రాజస్థాన్​ కట్టుదిట్టంగా బౌలింగ్​ చేసినా ఓపెనర్లు బాగా ఆడారు. ఇందులో ప్రభు సిమ్రన్​ సింగ్​ (60) పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన వారిలో బానుక రాజపక్స (1), సికిందర్​ రాజా (1), షారుక్​ఖాన్​ (11) పెద్దగా రాణించలేదు..

 అయితే.. ఓపెనర్​గా వచ్చిన శిఖర్​ ధవన్​ మాత్రం 86 పరుగులతో చివరిదాకా ఆడి నాటౌట్​గా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత ఓవర్లలో పంజాబ్ నాలుగు వికెట్లు కోల్పోయి​ 197 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్​ టార్గెట్​ 198 పరుగులుగా ఉంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement