Friday, April 26, 2024

పారా బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌కు ప్రమోద్‌ భగత్‌

భారత దిగ్గజ పారా బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు ప్రమోద్‌ భగత్‌ పారా బాడ్మింటన్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఇటు సింగిల్స్‌, అటు డబుల్స్‌లో ఫైనల్స్‌కు చేరాడు. సింగిల్స్‌ విభాగంలో జపాన్‌ క్రీడాకారుడు డయాసుకి ఫుజిహరను 22-20, 21-14 తేడాతో వరుస సెట్లలో ప్రమోద్‌ భగత్‌ విజయం సాధించాడు. ఫైనల్‌కు చేరాడు. ఫైనల్‌లో భారత్‌కు చెందిన నితీశ్‌ కుమార్‌తో తలపడనున్నాడు. అటు డబుల్స్‌ విభాగంలో ప్రమోద్‌ భగత్‌, మనోజ్‌ సర్కార్‌తో కలిసి ప్రత్యర్థి గులౌమి గైలీ- మాథ్యూ థామస్‌ జోడీపై 21-08, 21-16తేడాతో ఓడించాడు. భగత్‌ జోడీ ఫైనల్‌కు చేరింది. ఆదివారంనాడు ఫైనల్‌లో ఇండోనేసియా జోడీ రాందాని- ఉకున్‌ రన్‌కండితో తలపడనుంది. మరోవైపు వరల్డ్‌ నం.3 క్రీడాకారుడు సుకాంత్‌ కదమ్‌ సెమీఫైనల్‌లో ఇండోనేసియాకు చెందిన ఫ్రీడి సెటివాన్‌ చేతిలో 20-22, 15-21 తేడాతో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement