Friday, April 19, 2024

Breaking: ప్లే ఆఫ్స్‌ షురూ.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్, ఫైనల్ చేరేదెవరో?

దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ ఫైన‌ల్ స్టేజ్‌కి చేరింది. ఈ క్రమంలోనే కోల్‌కతా వేదికగా తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌కు అంతా రెడీ అయ్యింది.. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఇవ్వాల‌ ఫైనల్‌ బెర్తు కోసం పోటీప‌డుతున్నాయి. కాగా, టాస్ గెలిచిన గుజరాత్ సారధి హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. అలాగే గత మ్యాచ్‌లో గాయపడిన ఓపెనర్ వృద్ధిమాన్ సాహా పూర్తి ఫిట్‌గా ఉన్నాడని, ఈ మ్యాచ్‌లో ఆడుతున్నాడని చెప్పాడు. అలాగే లోకీ ఫెర్గూసన్ స్థానంలో జోసెఫ్ ఆడుతున్నట్లు వెల్లడించాడు. అదే సమయంలో తమ జట్టులో ఎలాంటి మార్పులూ లేవని రాజస్థాన్ రాయల్స్ సారధి సంజూ శాంసన్ తెలిపాడు.

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఓబెడ్ మెకాయ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యష్ దయాళ్

Advertisement

తాజా వార్తలు

Advertisement