Friday, April 19, 2024

Big Breaking: ఫైనల్​కు చేరిన పాకిస్తాన్‌.. సెమీస్‌లో న్యూజిలాండ్‌కు ప‌రాజ‌యం!

ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఇవ్వాల (బుధ‌వారం) న్యూజీలాండ్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య సెమీ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 152 ప‌రుగులు చేసి, పాకిస్తాన్ ముందు 153 ప‌రుగుల టార్గెట్ పెట్టింది. ఇక సెకండ్ బ్యాటింగ్‌కు దిగిన పాక్ విజ‌యం దిశ‌గా ప‌య‌నించే క్ర‌మంలో 132 ప‌రుగుల వ‌ద్ద రెండు వికెట్ల‌ను కోల్పోయింది.

నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య థ‌ర్డ్ అంపైర్ రెండో వికెట్‌ని అవుట్‌గా ప్ర‌క‌టించాడు. దీంతో ఓపెన‌ర్లుగా వ‌చ్చిన ఇద్ద‌రూ పెవిలియ‌న్ చేరారు. ఇందులో మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (57), బాబ‌ర్ ఆజ‌మ్ (53), మహ్మద్​ హరీశ్​ (30) ప‌రుగులు చేశారు. క్లిష్ట‌మైన స‌మ‌యంలో న్యూజీలాండ్ మెరుగైన ఆట‌తీరు ప్ర‌ద‌ర్శించ‌క‌పోవ‌డంతో ఓట‌మి త‌ప్ప‌లేదు. దీంతో 3 వికెట్ల నష్టానికి పాకిస్తాన్​ నిర్థీత ఓవర్లలో టార్గెట్​ని ఛేదించి విజయాన్ని అందుకుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement