Friday, April 26, 2024

Big Breaking | మూడో రోజు మనదే.. నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసిస్​

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్​ ఓవల్​ మైదానంలో జరుగుతోంది. మూడో రోజు ఆటలో భాగంగా టీమిండియా ఆల్​ అవుట్​కావడంతో ఆసిస్​ సెకండ్​ ఇన్నింగ్స్​ ప్రారంభించింది. అయితే.. తొలుత ఫస్ట్​ ఇన్నింగ్స్​ ఆడిన ఆసిస్​ జట్టు 469 పరుగులు చేయగా.. టీమిండియా ఫస్ట్​ ఇన్నింగ్స్​లో 296 పరుగులు చేసింది. ఇక.. ఆసిస్​ ఫస్ట్​ ఇన్నింగ్స్​లో ఇండియా కంటే 173 పరుగుల ఆధిక్యంలో ఉంది.. కాగా, సెకండ్​ ఇన్సింగ్స్​లో మూడో రోజు ఆటముగిసే సమయానికి ఆసిస్​ నాలుగు వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది.

కీలక విట్లు కోల్పోవడంతో మ్యాచ్​ స్లో అయ్యింది. పరుగులు రాబట్టడంలో బ్యాటర్లు తడబాటుకు గురయ్యారు. ఇక.. రెచ్చిపోయిన టీమిండియా బౌలర్లు ఆసిస్​ని కోలుకోలేని దెబ్బతీశారు. ఈ క్రమంలో ఉస్మాన్​ ఖవాజా (13), డేవిడ్​ వార్నర్​ (1), స్టీవ్​ స్మిత్​ (34), ట్రావిస్​ హెడ్​ (18) పరుగులు మాత్రమే చేయగలిగారు. కాగా, స్పిన్నర్​ రవీంద్ర జడేజాకు 2 వికెట్లు, మహ్మద్​ సిరాజ్​, ఉమేశ్​ యాదవ్​కు తలా ఒక వికెట్​ దక్కింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement