Friday, April 19, 2024

Breaking: శ్రీలంకపై న్యూజిలాండ్​ గెలుపు.. 65 పరుగుల భారీ విజయం

ఐసీసీ టీ20 వరల్డ్​ కప్​ లో భాగంగా ఇవ్వాల (శనివారం) జరిగిన మ్యాచ్​లో శ్రీలంకపై న్యూజిలాండ్​ జట్టు గెలిచింది. తొలుత టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న కివీస్​ జట్టు ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. అయితే మ్యాచ్​ ప్రారంభంలోనే కీలక వికెట్లను టఫా టఫా పోగొట్టుకున్న కివీస్​.. ఆ తర్వాత కోలుకుని మెరుగైన స్కోర్​ని చేయగలిగింది.

అయితే.. సెకండ్​ ఇన్సింగ్స్​లో బ్యాటింగ్​కి దిగిన శ్రీలంక జట్టు దూకుడుగా ఆడడానికి యత్నించి బోర్లాపడింది. లంక టాపార్డర్​ కూడా త్వరగా పెవిలియన్​ చేరడంతో ఆ జట్టు కష్టాల్లో పడింది. దీంతో నిర్ణీత ఓవర్లలో 168 పరుగుల టార్గెట్​ చేరుకోలేక 19.2 ఓవర్లలోనే పది వికెట్లు కోల్పోయి కేవలం 102 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కివీస్​ జట్టు లంకపై 65 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతానికి 5 పాయింట్లతో న్యూజిలాండ్​ టాప్​ ప్లేస్​లో ఉంది

Advertisement

తాజా వార్తలు

Advertisement