Thursday, March 28, 2024

ఆ నలుగురు క్లారిటీ గానే వచ్చారు…!! మనమే అర్థం చేసుకోలేదు

అహ్మదాబాద్ లో జరుగుతున్న మొదటి టి20 మ్యాచ్ లో టీమ్ ఇండియా తడబడింది. 124 పరుగులకే చేతులెత్తేసింది. మ్యాచ్ మొదలైన నిమిషాల వ్యవధిలోనే ఓపెనర్ బ్యాట్స్ మ్యాన్ కేఎల్ రాహుల్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే విరాట్ కోహ్లీ కూడా క్రీజు వదిలాడు. ఆ తరువాత వచ్చిన పంత్ మాత్రం కాసేపు క్రీజులో నిలబడ్డాడు. ఇక మిడిలార్డర్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ 67 పరుగులు చేసి స్కోర్ ము ముందుకు తీసుకెళ్ళాడు. మొత్తం 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయిన భారత్ 124 పరుగులు చేసింది.

అయితే సోషల్ మీడియాలో నెటిజన్లు టీమిండియా పై అప్పుడే ట్రోల్స్ మొదలు పెట్టేసారు. మ్యాచ్ ముందు గ్రౌండ్ లో జనగణమన పాడే సమయంలో కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఈ నలుగురు ప్యాడ్స్ కట్టుకొని కనిపించారు. ఈ నలుగురు ఒకేసారి ప్యాడ్స్ కట్టుకుని రెడీ గా ఉన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది అంటూ సెటైర్లు వేయడం మొదలుపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement