Thursday, April 25, 2024

డివిలియర్స్ ఫోన్ లో బ్యాలన్స్ లేదు…అందుకే కోహ్లీ ఔట్ అయ్యాడట

అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో మ్యాచ్ లో టీమ్ ఇండియా 8 పరుగుల తేడాతో విన్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ లో టాస్ గెలిచిన బౌలింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ కు టీమ్ ఇండియా 185 పరుగుల టార్గెట్ ను ఇచ్చింది. అయితే నిర్ణిత ఓవర్ల లో ఇంగ్లాండ్ 177 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక ఈ విజయంతో టీమిండియా 5 టీ20ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది.ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మీమ్స్ విపరీతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే.

కాగా తాజాగా ఏబీ డివిలియర్స్ విరాట్ కోహ్లి పై సోషల్ మీడియాలో మీమ్స్ ప్రత్యక్షమయ్యాయి. రెండవ టి20 మ్యాచ్ లో ఇండియా విజయంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా సొంతం చేసుకున్నాడు. ఆ సమయంలో మాట్లాడిన కోహ్లీ మ్యాచ్ కి ముందు ఏబీ డివిలియర్స్ తో చాట్ చేశా నాకు ఓ విషయం చెప్పాడు..బాలుని చూసి కొట్టు అంతే..అని చెప్పాడని కోహ్లీ చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పుడు ఈ మ్యాచ్ లో కోహ్లీ 1 పరుగు చేసి క్రీజు వదిలాడు. దీనితో నెటిజన్స్ ఏబీ డివిలియర్స్ ఫోన్ లో బ్యాలన్స్ అయిపోయిందా… అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అంతే కాకుండా ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement