Wednesday, April 24, 2024

Breaking: ముంబై ఇవ్వాలైనా గెలిచేనా?.. 14 ఓవర్లకు 113/2

టాటా ఐపీఎల్​ 2022లో భాగంగా ఇవ్వాల (శనివారం) రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు తడబడుతోంది. 159 పరుగుల టార్గెట్​ చేజింగ్​ చేస్తున్న ముంబై.. ఇన్నింగ్స్ ఆరంభంలోనే రోహిత్ శర్మ (2) అవుటయ్యాడు. అయితే కొన్ని మంచి షాట్లు ఆడుతూ టచ్‌లో కనిపించిన ఇషాన్ కిషన్ (26) తనకు లభించిన జీవనదానాన్ని ఉపయోగించుకోలేకపోయాడు.

ఇక.. బౌల్ట్ వేసిన ఆరో ఓవర్లో షార్ట్ బాల్‌ను పుల్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ సరిగా కుదరకపోవడంతో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ శాంసన్ అందుకున్నాడు. దీంతో ఇషాన్ కిషన్ కూడా పెవిలియన్ చేరాడు. పవర్‌ప్లే ముగిసే సరికి ముంబై జట్టు రెండు వికెట్ల నష్టానికి 41 పరుగులు చేసింది. కాగా,  ముంబై జట్టు 14 ఓవర్లకు 113 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement