Friday, March 29, 2024

దంచికొట్టిన లివింగ్ స్టోన్‌, బెయిర్‌స్టో.. పంజాబ్ స్కోరు 209 ప‌రుగులు

ఐపీఎల్ 2022లో భాగంగా ఇవ్వాల ముంబై వేదిక‌గా జ‌రుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాట్స్‌మ‌న్‌ లివింగ్ స్టోన్‌, బెయిర్ స్టో వీర విహారం చేశారు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశారు. వీరిద్ద‌రి సూప‌ర్ ఇన్నింగ్స్‌ల‌తో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయిన పంజాబ్ కింగ్స్ జ‌ట్టు ఏకంగా 209 ప‌రుగులు చేసింది. లివింగ్ స్టోన్ 70 ప‌రుగుల‌తో రాణించ‌గా.. బెయిర్ స్టో 66 ప‌రుగులు రాబ‌ట్టాడు. ఓ వైపు వ‌రుస‌గా వికెట్లు ప‌డుతున్నా వీర‌ద్ద‌రు మాత్రం త‌మ ఆట‌తీరులో ఎలాంటి మార్పు చేసుకోలేదు.

ఇక.. బెంగ‌ళూరు బౌలింగ్ విష‌యానికి వ‌స్తే.. హ‌ర్ష‌ల్ ప‌టేల్ ఏకంగా 4 వికెట్లు తీసుకున్నాడు. వనిందు హ‌స‌రంగాకు రెండు వికెట్లు ద‌క్క‌గా.. మ్యాక్స్‌వెల్‌, షాబాద్ అహ్మ‌ద్‌కు చెరో వికెట్ ద‌క్కింది. హైద‌రాబాదీ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్‌కు వికెట్లేమీ ద‌క్క‌క‌పోగా…. ఓవ‌ర్‌కు 18 ప‌రుగుల చొప్పున స‌మ‌ర్పించుకుని పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌బ‌ర‌చాడు. మ‌రికాసేప‌ట్లో 210 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో పంజాబ్ కింగ్స్ ఛేజింగ్ ప్రారంభించ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement