Saturday, April 20, 2024

ఏబీ డివిలియర్స్‌ రీ ఎంట్రీ, వచ్చే ఏడాది రానున్నట్టు కోహ్లీ వెల్లడి

దక్షిణాఫ్రికా క్రికెట్‌ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ మళ్లీ ఐపీఎల్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తున్నది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున మళ్లిd బరిలోకి దిగుతున్నట్టు సమాచారం. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు డివిలియర్స్‌ గుడ్‌ బై చెప్పేశాడు. గతేడాది ఐపీఎల్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. కానీ వచ్చే ఏడాది ఐపీఎల్‌కు బెంగళూరు తరఫున ఏబీడీ ఉంటాడని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ హింట్‌ ఇచ్చాడు.

ఏబీడీని చాలా మిస్‌ అవుతున్నట్టు కోహ్లీ చెప్పుకొచ్చాడు. అప్పుడప్పుడు మాట్లాడుతానని, అమెరికాలో గోల్ఫ్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడన్నాడు. వచ్చే ఏడాది ఆర్‌సీబీలోకి వస్తాడని భావిస్తున్నాని కోహ్లీ తెలిపాడు. తన ఫామ్‌పై స్పందిస్తూ.. గతంలో ఇంత ఘోరంగా ఎప్పుడూ విఫలం కాలేదని, నవ్వుతూనే ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టు వివరించాడు. ఆటలో అన్ని అనుభవాలు పొందుతున్నట్టు తెలిపాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement