Tuesday, April 23, 2024

ఐపీఎల్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్టు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ప్రారంభంతో బెట్టింగ్ రాయుళ్లు కూడా జోరు పెంచారు. ప్రతి మ్యాచ్ పై భారీగా బెట్టింగ్ లు నిర్వహిస్తూ యువతను పెడదారి పట్టిస్తున్నారు. ఇలా ఆన్ లైన్ లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ముఠాను గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. బెట్టింగ్ రాకెట్‌ను గోవా పోలీసులు నిర్వర్యం చేశారు. ఐపీఎల్ మ్యాచ్‌ల‌పై బెట్టింగ్‌కు పాల్ప‌డిన ఆరుగుర్ని అరెస్టు చేశారు. గ‌త రాత్రి వాస్కో ప్రాంతం నుంచి వాళ్ల‌ను అదుపులోకి తీసుకున్నారు. భారీ మొత్తంలో రాకెట్‌ను న‌డుపుతున్న‌ట్లు సౌత్ గోవా పోలీసులు వెల్ల‌డించారు. కేసు నమోదు చేసుకుని కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: సిద్ధార్థ్, శర్వానంద్ ‘మహాసముద్రం’ ట్రైలర్

Advertisement

తాజా వార్తలు

Advertisement