Saturday, April 20, 2024

31న భారత్‌- పాక్‌ మ్యాచ్.. మ‌హిళా క్రికెట్ మాత్ర‌మే చాన్స్‌..

కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారిగా క్రికెట్‌ను కూడా ప్రవేశపెట్టిన నేపథ్యంలో చిరకాల ప్రత్యర్థులు ఇండియా- పాకిస్తాన్‌లు తలపడనున్నాయి. అయితే మహిళా క్రికెట్‌కు మాత్రమే అవకాశం కల్పించారు. టీ20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరుగనున్నాయి.

గ్రూప్‌-ఏలో భారత్‌, పాకిస్తాన్‌లుండగా, భారత్‌ తొలుత ఆస్ట్రేలియాతో తలపడనుంది. అనంతరం జులై 31న ఎడ్జబాస్టన్‌ వేదికగా జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో టీమిండియా ఆడనుంది. ఈ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement