Friday, April 26, 2024

Breaking: జపాన్​ను చిత్తు చేసిన భారత్.. కాంస్య పోరులో టీమిండియాదే విజయం

ఇండోనేషియాలోని జకర్తా వేదికగా జరుగుతున్న ఆసియా కప్ హాకీ-2022లో భారత జట్టు కాంస్యం నెగ్గింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో యువ భారత్ అదరగొట్టింది. 1-0 తేడాతో జపాన్​ను చిత్తు చేసింది. బుధవారం జపాన్​తో జరిగిన హోరాహోరి పోరులో భారత జట్టు గట్టి పట్టుదలతో ఆడి విజయాన్ని అందుకుంది. భారత్ తరఫున ఏడో నిమిషంలో గోల్ కొట్టి భారత్ ను ఆధిక్యంలోకి తెచ్చాడు రాజ్ కుమార్ పాల్​.. ఆ తర్వాత భారత్ కు పలు పెనాల్టీ కార్నర్ ల ద్వారా గోల్ కొట్టే చాన్స్​ వచ్చినా మన ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఆట తొలి క్వార్టర్ ముగుస్తుందనగా జపాన్ దాదాపు తొలి గోల్ కొట్టినంత పని చేసింది. కానీ, భారత ఆటగాళ్లు జపాన్ ఆటలు సాగనివ్వలేదు.

ఇక. ఆట ముగుస్తుందనగా కూడా జపాన్ కు 48వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ లభించాయి. కానీ, వాటిని గోల్స్ గా మలచడంలో జపాన్ విఫలమైంది. దీంతో భారత జట్టు 1-0 తేడాతో జపాన్ ను చిత్తు చేసి కాంస్యం నెగ్గింది. అంతకుముందు మంగళవారం ముగిసిన సూపర్-4 లో భాగంగా టీమిండియా దక్షిణ కొరియాతో మ్యాచ్ లో 4-4 తో డ్రా గా ముగించింది. తప్పక గెలవాల్సిన చోట మ్యాచ్ ను డ్రా చేసుకోవడంతో మెరుగైన గోల్స్ తో దక్షిణ కొరియా ఫైనల్ కు చేరింది. జపాన్​ను ఓడించిన మలేషియా కూడా ఫైనల్ చేరింది. ఈ రెండు జట్లు ఇవ్వాల (బుధవారం) సాయంత్రం ఫైనల్ లో తలపడనున్నాయి. బుధవారం మధ్యాహ్నం జరిగిన కాంస్య పోరులో భారత్ గెలిచి పతకం సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement