Thursday, April 18, 2024

Cricket: టీ20 వరల్డ్​ కప్​.. వామప్​ మ్యాచ్​లతో బిజీగా ఉన్న టీమిండియా

టీ20 వరల్డ్​ కప్​ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది టీమిండియా. దీనికి ముందు పెర్త్‌లో రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఆడిన జట్టు ఒక దానిలో నెగ్గి, రెండో దానిలో ఓడిపోయింది. ఈ రెండు మ్యాచుల్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడలేదు. అయితే.. రెండో మ్యాచులో కోహ్లీతోపాటు సూర్యకుమార్ కూడా ఆడకపోవడం జట్టు విజయావకాశాలను దెబ్బతీసిదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఇక.. ఈ ప్రాక్టీస్ మ్యాచుల్లో కొన్ని పాఠాలు నేర్చుకున్న టీమిండియా.. ప్రపంచకప్ ప్రారంభానికి ముందు చివరగా మరో రెండు వామప్ మ్యాచులు ఆడేందుకు రెడీ అయ్యింది. వీటిలో జట్టు వ్యూహాలకు తుదిమెరుగులు దిద్దుకునే చాన్సెస్​ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శనివారం భారత జట్టు బ్రిస్బేన్ చేరుకుంది. టీమిండియా క్రికెటర్లు బ్రిస్బేన్​ చేరుకున్న వీడియోను బీసీసీఐ తన ట్విట్టర్ అకౌంట్​లో షేర్​ చేసింది. ఈ వీడియోలో భారత ఆటగాళ్లు అభిమానులకు అభివాదం చేస్తూ, ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ కనిపించారు. ఇక్కడి గబ్బా మైదానంలో తొలుత ఆస్ట్రేలియాతో, అనంతరం న్యూజిల్యాండ్‌తో భారత జట్టు వామప్ మ్యాచులు ఆడనుంది. అనంతరం వచ్చే ఆదివారం పాకిస్తాన్‌తో తన తొలి మ్యాచ్ ఆడుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement