Friday, April 26, 2024

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌.. కోహ్లీకి 9వ ర్యాంకు, 2 స్థానాలు ఎగబాకిన విరాట్‌

టెస్టు కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పిన కోహ్లీ ర్యాంకింగ్స్‌లో మెరుగయ్యాడు. ఐసీసీ విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో రోహిత్‌ శర్మ తన ర్యాంకును నిలబెట్టుకోగా.. విరాట్‌ రెండు స్థానాలు పైకి ఎగబాకాడు. రోహిత్‌ ఖాతాలో 8 రేటింగ్‌ పాయింట్లు తగ్గినా.. 773 పాయింట్లతో ఐదో ర్యాంకులో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో రాణించిన కోహ్లీ ఖాతాలో 27 రేటింగ్‌ పాయింట్లు చేరాయి. దీంతో మొత్తం 767 పాయింట్లతో 9వ స్థానం నుంచి 7వ స్థానానికి ఎగబాకాడు. టాప్‌లో లబుషేన్‌ (935) ఉన్నాడు.

బౌలర్ల జాబితాలో బుమ్రా సత్తా చాటాడు. టాప్‌-10లో పదో స్థానంలో నిలిచాడు. బుమ్రా ఖాతాలో 763 రేటింగ్‌ పాయింట్లున్నాయి. 839 పాయింట్లతో అశ్విన్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ కమిన్స్‌ (898) ఉన్నాడు. గతంతో పోలిస్తే.. 22 పాయింట్లు తగ్గినా.. ర్యాంకులో మార్పు లేదు. వన్డే బౌలింగ్‌ జాబితాలో 679 పాయింట్లతో బుమ్రా.. ఏడో స్థానంలో ఉన్నాడు. టాప్‌-10లో ఒక్కడే ఉన్నాడు. వన్డే బౌలింగ్‌ టాప్‌లో ట్రెంట్‌ బౌల్ట్‌ (737) కొనసాగుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement