Thursday, April 18, 2024

Guntur : ఖేలో ఇండియా పోటీలలో.. రేటూరు గ్రామ యువకుడి ప్రతిభ

లక్నోలో జరిగిన ఖేలో ఇండియా పోటీలలో ఆంధ్రప్రదేశ్ నుండి హై జంప్ పోటీలో పాల్గొని జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ ను సాధించారు షేక్ మొహిద్దీన్.కాగా గుంటూరు జిల్లా కాకుమాను మండల పరిధిలోని రేటూరు గ్రామానికి చెందిన షేక్ మొహిద్దీన్ ఇండియా స్థాయిలో ప్రతిభకు పేదరికం అడ్డు కాదని మొహిద్దీన్ నిరూపించారు. ఓ వైపు పేదరికంతో ఇబ్బందులు పడుతున్నా.. క్రీడ‌ల‌పై ఉన్న ఆసక్తితో పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ పోటీలలో పాల్గొంటున్నట్లు మొహిద్దీన్ తెలిపారు. ప్రభుత్వం పరంగా ప్రోత్సహిస్తే భవిష్యత్ లో మరెన్నో పతకాలు సాధించగలనని తెలిపారు. ఈ సందర్బంగా గ్రామస్తులు, యువత మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన మొహిద్దీన్ కు అభినందనలు తెలియజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement